కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నాలుగు స్ధానాల్లో టీఎంసీ ఘనవిజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ఉప పోరులో నాలుగు నియోజకవర్గాలకు గాను మూడు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులకు డిపాజిట్లు రాలేదని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ మంగళవారం ట్వీట్ చేశారు.
ఉప ఎన్నికల్లో రెండవ, మూడవ స్ధానం కోసం బీజేపీ, సీపీఎంల మధ్య హోరాహోరీ పోరు సాగిందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బెంగాల్ ప్రజలు విద్వేష రాజకీయాలను విస్మరించి అభివృద్ధి రాజకీయాలకు పట్టం కట్టారని సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీని ఆదరించిన ఓటర్లకు దీదీ ధన్యవాదాలు తెలిపారు.