చండీగఢ్: డేరా సచ్చా సౌదా సంస్థ మాజీ మేనేజర్ రంజిత్సింగ్ హత్య కేసులో ఆ సంస్థ చీఫ్ గుర్మిత్ రాం రహీమ్ సింగ్ (డేరా బాబా)ను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. 2002లో రంజిత్ సింగ్ హత్యకు గురయ్యారు. డేరా సచ్చా సౌదాలో మహిళలు ఏ విధంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారో తెలిపే ఓ లేఖ బయటికి రావడంలో రంజిత్సింగ్ పాత్ర ఉన్నదని డేరా బాబా అనుమానించి, హత్య చేయించాడు.