నిజామాబాద్, మే 13, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డులను రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి గురువారం సందర్శించారు. కొవిడ్ బాధితులతో మాట్లాడి వారిలో మానసిక ైస్థెర్యాన్ని నింపారు. పీపీఈ కిట్లు లేకుండానే కొవిడ్ వార్డుల్లో మంత్రి వేముల, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి పర్యటించడం విశేషం.
ధైర్యం నింపిన మంత్రి..
మంత్రి వేముల పర్యటన కరోనా చికిత్స పొందుతున్న వారిలో ధైర్యాన్ని నింపింది. సర్కారు వైద్యశాలల్లో కొవిడ్ పేషెంట్లకు అందుతున్న సౌకర్యా లు, చికిత్స విధానాలపై వైద్యులు, వైద్య సిబ్బంది, కలెక్టర్తోపాటు సందర్శించడం ద్వారా లోటుపాట్లను మంత్రి స్వయంగా పరిశీలించారు. అవసరాలను గుర్తించడంతో పాటు త్వరలోనే ఆయా దవాఖానల్లో వెంటిలేటర్ సౌకర్యాలను పెంచేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్మూర్ ప్రభుత్వ దవాఖానను ప్రజల సౌకర్యార్థం తక్కువ సమయంలో కొవిడ్ వైద్యశాలగా మార్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే జీవన్రెడ్డిని మంత్రి అభినందించారు. ఆక్సిజన్ సౌకర్యాన్ని పరిశీలించారు. నిజామాబాద్ పెద్దాసుపత్రిలో సుమారు 400 మంది కొవిడ్ పేషెంట్లు ఉండగా.. వారికి అందుతున్న వైద్య సాయాన్ని మంత్రి పరిశీలించారు. కరోనా సోకి ఆక్సిజన్ సాయంతో చికిత్స తీసుకుంటున్న వృద్ధుడిని, 13 ఏండ్ల బాలికను మంత్రి పలుకరించారు. ఏం కాదు. ధైర్యంగా ఉండు త్వరలోనే ఇంటికి పోతావంటూ విజయ సంకేతం చూపిస్తూ బాలికలో మంత్రి మనోైస్థెర్యం నింపారు.
వైద్యులు, వైద్య సిబ్బంది సేవలు అమోఘం..
కరోనా సోకిన వారికి డాక్టర్లు, వైద్యసిబ్బంది, ఏఎన్ఎంలు, శానిటేషన్ సిబ్బంది సేవలు చేయడం గొప్ప విషయమని మంత్రి వేముల అన్నారు. వారి సేవలను ఎంత పొగిడినా తక్కువేనని చెప్పా రు. జీజీహెచ్లో కొవిడ్ వార్డులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్ర భుత్వ దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారం తా త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి వెళ్తున్నారన్నారు. వైద్యులు, వైద్యసిబ్బంది బాధితులకు సొంత మనుషుల కన్నా ఎక్కువ సేవ చేస్తున్నారని చెప్పారు. కరోనా పేషెంట్లకు సమకూరే సదుపాయాలు, చికిత్సపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ.. అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బాధితుల బంధువులందరూ సామరస్యంగా ఉంటూ వైద్య సిబ్బందికి సహకరించాలన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్నదని మంత్రి చెప్పారు.
పీపీఈ కిట్లు ధరించకుండానే..
కొవిడ్ పేషెంట్లను పలుకరించేందుకు వచ్చిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి పీపీఈ కిట్లు ధరించకుడానే కొవిడ్ వార్డుల్లో కలియతిరిగారు. ధైర్యంగా కరోనా బాధితులతో మాట్లాడి వారిలో ఆత్మస్తైర్యాన్ని నింపారు. మనోధైర్యమే మందు అన్న సూత్రాన్ని ప్రజల్లోకి తీసుకు పోయేందుకు మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్లు నేరుగా కొవిడ్ వార్డు ల్లో పర్యటించారు. పీపీఈ కిట్లతో వారి చెంతకు చేరడం మూలంగా తమకేదో అయ్యిందని బాధితులు భయాందోళనకు గురయ్యే వీలుంది. ఈ నేపథ్యంలోనే కనీస జాగ్రత్తలతోనే వారు కొవిడ్ వార్డుల్లో ధైర్యంగా ముందుకు వెళ్లారు. మంత్రి స్వయంగా వచ్చి సేవలను పరిశీలించడంతో పాటు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బందిని అభినంచించడం ద్వారా ఫ్రంట్లైన్ వారియర్స్ సంతోషం వ్యక్తంచేస్తున్నారు.