న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్నది. మహా నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో వాయు నాణ్యత దారుణంగా పడిపోతున్నది. శనివారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AIQ) 431గా నమోదయింది. ఇక రాజధాని ప్రాతంలో ఉన్న ధిర్పూర్లో అత్యధికంగా ఏఐక్యూ 534గా ఉండగా నోయిడాలో 529, గురుగ్రామ్లో 478 నమోదయింది. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడుతున్నారు.
వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండటంతో ఢిల్లీలో నేటి నుంచి ప్రైమరీ పాఠశాలను ప్రభుత్వం మూసివేసింది. సోమవారం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం మందికి వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేయనున్నారు. ఇదే విధానాన్ని ప్రైవేటు సంస్థలు కూడా పాటించాలని ప్రభుత్వం సూచించింది. వీటితో పాటు ఢిల్లీలో మార్కెట్లు, ఆఫీసుల పనివేళల సమయం తగ్గించే ఆలోచన కూడా చేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు.
Air quality continues to dip in Delhi-NCR.
Air Quality Index (AQI) presently at 529 in Noida (UP) in 'Severe' category, 478 in Gurugram (Haryana) in 'Severe' category & 534 near Dhirpur in 'Severe' category
Delhi's overall AQI currently in 'Severe' category at 431 pic.twitter.com/ONUcv9naJJ
— ANI (@ANI) November 5, 2022
Delhi shrouded in smog as air quality remains in the 'Severe' category; Visuals from the area around Signature Bridge. pic.twitter.com/Ksld9ZSo0N
— ANI (@ANI) November 5, 2022