న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం స్కూళ్లను తెరువబోమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు తమ ప్రభుత్వం ఎలాంటి రిస్క్ తీసుకోదని ఆయన చెప్పారు. కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనక తప్పదని ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు వినిపిస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యేంత వరకు ఎలాంటి రిస్క్ తీసుకోబోమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కరోనా కేసులు తగ్గడంతో లాక్డౌన్ ఆంక్షలు సడలించినా స్కూళ్లను మాత్రం ఇప్పుడే తెరిచే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదన్నారు.