న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ నేపథ్యంలో సోమవారం నుంచి వారం వరకు లాక్డౌన్ విధించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలోని స్కూళ్లకు మంగళవారం నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. గత షెడ్యూల్ ప్రకారం మే 11 నుంచి జూన్ 3 వరకు వేసవి సెలవులుగా నిర్ణయించారు. అయితే ఢిల్లీలో కరోనా తీవ్రత, వారం రోజులు లాక్డౌన్ నేపథ్యంలో దీనిని ముందుకు తెచ్చినట్లు ఢిల్లీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.