న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 316 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. 41 మంది మరణించారు. 521 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,962 కాగా, ఇప్పటి వరకు 24,668 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఢిల్లీలో 14,29,791 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 14,00161 మంది కోలుకున్నారు.