న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు ఆరు నెలల గరిష్ఠానికి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 331 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,289కి చేరింది. ఇందులో 692 మంది హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు. ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 0.68 శాతానికి పెరిగింది. దీంతో దేశ రాజధాని నగరంలో మరోసారి ఎల్లో అలర్ట్ జారీ చేయవచ్చని తెలుస్తున్నది.
మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 142కు చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇది అమలవుతుంది. దీంతో నిత్యవసరం కాని మార్కెట్లు, రెస్టారెంట్లు, బార్లు, షాపులను నైట్ కర్ఫ్యూ సమయంలో మూసివేస్తారు.