వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమిని గురువారం వరంగల్ అర్బన్ జిల్లాలో రైతులు నిర్వహించుకున్నారు. హసన్పర్తి, ధర్మసాగర్ మండలాల్లో రైతులు కాడెద్దులను కడిగి వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గజ్జలు, గంటలతో అలంకరించారు. ఎడ్లకు కట్టే కాడిని దూప దీప నైవేద్యాలతో పూజించారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు చేశారు. అనంతరం దుక్కి దున్నారు.
-చకినాల శ్యాం, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్