న్యూఢిల్లీ: ఉన్నత హోదాలో ఉన్న ఒక ప్రభుత్వ అధికారి (Delhi Officer) స్నేహితుడి కుమార్తెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భం దాల్చగా అతడి భార్య పిల్స్ ఇచ్చి నివారించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఢిల్లీ మహిళా, శిశు అభివృద్ధి శాఖలో సీనియర్ అధికారిగా పని చేస్తున్న వ్యక్తి స్నేహితుడు 2020లో మరణించాడు. ఈ నేపథ్యంలో అతడి కుమార్తెను ఆ అధికారి తన ఇంటికి తీసుకెళ్లాడు.
కాగా, 2020 నుంచి 2021 వరకు ఆ అధికారి స్నేహితుడి కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో 14 ఏండ్ల వయసున్న ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తన భార్యకు చెప్పగా అతడికి ఆమె సహకరించింది. కుమారుడి ద్వారా గర్భం పోయే పిల్స్ తెప్పించి ఆ బాలికకు వేయించింది. అలా ఆమె ప్రెగ్నెన్సీని నివారించింది.
మరోవైపు 12వ తరగతి చదువుతున్న బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. తండ్రి స్నేహితుడైన ప్రభుత్వ అధికారి పలు నెలలపాటు తనపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపించింది. తనకు ప్రెగ్నెన్సీ రాగా దానిని నివారించేందుకు అతడి భార్య పిల్స్ ఇచ్చినట్లు చెప్పింది.
ఈ నేపథ్యంలో ఆ భార్యాభర్తలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల కోసం బాధిత బాలికను ఆసుపత్రికి తరలించారు. మెజిస్ట్రేట్ ఎదుట ఆమె స్టెట్మెంట్ రికార్డ్ చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు. దాని ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని వెల్లడించారు.