న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో అల్లోపతికి వ్యతిరేకంగా దుష్ర్పచారం చేశారని ఆరోపిస్తూ ఐఎంఏతో పాటు ఇతర వైద్యులు దాఖలు చేసిన పిటిషన్పై యోగా గురు బాబా రాందేవ్కు ఢిల్లీ హైకోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ఈ దావాపై సమాధానం ఇచ్చేందుకు బాబా రాందేవ్కు జస్టిస్ సీ హరిశంకర్ నాలుగు వారాల గడువు ఇచ్చారు. జనవరిలో ఈ కేసుపై తదుపరి విచారణను చేపడతామని కోర్టు పేర్కొంది.
అల్లోపతి వైద్యంపై రాందేవ్ వ్యాఖ్యల వీడియో తాను చూశానని, ఇందులో ఆయన అల్లోపతి చికిత్సా పద్ధతులను తూలనాడారని, ఇది పిటిషనర్లు దావా వేయదగినదేనని బాబా రాందేవ్ తరపు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ రాజీవ్ నాయర్ను ఉద్దేశించి న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఐఎంఏ వైద్యులు దాఖలు చేసిన దావాలో కరోనిల్, పరువునష్టం, వ్యాక్సిన్కు విముఖత వంటి మూడు భాగాలున్నాయని..అయితే నోటీసులను కేవలం పరువునష్టం దావాకు మాత్రమే పరిమితం చేయాలని నాయర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో తన క్లెయింట్ బాబా రాందేవ్పై చేసిన ఆరోపణలను నాయర్ తోసిపుచ్చారు.