న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. దేశంలో ఈ కేసుల సంఖ్య వంద దాటింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ పాజిటివ్ రోగుల కోసం ప్రత్యేకంగా నాలుగు ఆసుపత్రులను కేటాయించింది. ప్రైవేట్ ఆసుపత్రులైన సర్ గంగా రామ్ హాస్పిటల్, సాకేత్లోని మాక్స్ హాస్పిటల్, వసంత్ కుంజ్లోని ఫోర్టిస్ హాస్పిటల్, తుగ్లకాబాద్లోని బాత్రా హాస్పిటల్ను డెడికేటెడ్ ఒమిక్రాన్ కేంద్రాలుగా ప్రకటించింది. ఢిల్లీలో ఒమిక్రాన్ సోకిన వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్న లోక్ నాయక్ జై ప్రకాష్ (LNJP) హాస్పిటల్తో పాటు ఈ నాలుగు ప్రైవేట్ ఆసుపత్రులు కొత్త వేరియంట్ బారిన పడిన వారికి వైద్య చికిత్స అందించనున్నాయి.