న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పోలింగ్ బూత్లకు చేరుకుని ఓటు వేస్తున్నారు. ఢిల్లీలోని ముఖ్య నేతలు, ఇతర ప్రతినిధుల కోసం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అక్కడ ఇప్పటికే కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం, సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ తదితరులు ఓట్లు వేసి వెళ్లారు.
తాజా మాజీ ప్రధాని మన్మోహన్ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఓటు వేశారు. కాగా, ఢిల్లీతోపాటు వివిధ రాష్ట్రాల్లోని పార్టీ హెడ్క్వార్టర్స్లో పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసింది. ఏ రాష్ట్రానికి చెందిన పార్టీ ప్రతినిధులు ఆ రాష్ట్రంలోనే ఓట్లు వేస్తున్నారు. బెంగళూరులో మల్లిఖార్జున్ ఖర్గే ఓటు వేశారు.