న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సీబీఐ కస్టడీని మరో రెండు రోజులపాటు కోర్టు పొడిగించింది. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన సిసోడియా విచారణలో తమకు సహకరించడం లేదని, ఆయనను మరింతగా విచారించాల్సి ఉన్నదని పేర్కొంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది
. అయితే ఈ పిటిషన్ను సిసోడియా తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు సీబీఐ కస్టడీని మరో రెండు రోజులపాటు పొడిగిస్తూ తీర్పునిచ్చింది.