న్యూఢిల్లీ: జేఎన్యూ విద్యార్థి షార్జీల్ ఇమామ్కు ఢిల్లీ హైకోర్టు ఇవాళ బెయిల్ను నిరాకరించింది. 2019లో ఢిల్లీలో జరిగిన అల్లర్ల కేసులో అతన్ని అరెస్టు చేశారు. విద్వేషపూరిత, రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసినట్లు షార్జీల్పై కేసు నమోదు అయ్యింది. అయితే ఆ ప్రసంగం వర్గ హింసకు దారితీసేలా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019, డిసెంబర్ 13వ తేదీన ఇమామ్ రెచ్చగొట్టే ప్రసంగం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత రెండు రోజులకే భారీ స్థాయిలో అల్లర్లు జరిగాయి. జామియా నగర్ పోలీసు స్టేషన్పై సుమారు మూడు వేల మంది దాడి చేసి హింసకు పాల్పడ్డారు. అడిషనల్ సెషన్స్ జడ్జి అంజూ అగర్వాల్ బెయిల్ను నిరాకరిస్తూ.. ఇమామ్ ప్రసంగం మతవిద్వేషాలకు దారి తీసేవిధంగా ఉన్నట్లు తెలిపారు.