న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో 16 ఏళ్ల యువతిని 21 ఏళ్ల యువకుడు గొడ్డలితో నరికి చంపాడు. గత కొన్ని రోజుల నుంచి 11వ తరగతి చదువుతున్న ఆ అమ్మాయిని ప్రవీణ్ అనే వ్యక్తి వెంటాడి వేధిస్తున్నాడు. యువతిని నరికిన నిందితుడు హర్యానాలోని పల్వాల్లో తన సోదరి ఇంట్లో దాక్కున్నాడు. అతన్ని పోలీసులు పట్టుకున్నారు. గొడ్డలితో ముఖంపై దాడి చేయడంతో ఆ యువతి స్పృహ తప్పిపోయింది. ఆమెను సఫ్దార్జంగ్ హాస్పిటల్లో చేర్పించారు. కానీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. మోతీ భాగ్ నివాసితుడు9 అయిన ప్రవీణ్ నిరుద్యోగి. కొన్ని నెలల నుంచి ఆ అమ్మాయి వెంటబడుతున్నాడు. అయితే వేధింపులు తట్టుకోలేక ఆమె తన తండ్రికి ఫిర్యాదు చేసింది. ప్రవీణ్ను ఆ అమ్మాయి తండ్రి ఓసారి కొట్టాడు. దీంతో పగ పెంచుకున్న ఆ యువకుడు.. గొడ్డలితో ఆ అమ్మాయిపై దాడి చేశాడు. ఆర్కే పురంలో గొడ్డలిని కొన్నట్లు పోలీసులు నిర్ధారించారు.