Delhi horror : దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. 70 ఏళ్లున్న వృద్ధ దివ్యాంగురాలిపై ఒక వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన తూర్పు ఢిల్లీ, త్రిలోక్పురి ప్రాంతం, మయూర్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది.
బాధిత వృద్ధురాలు అంధురాలు. మానసిక వైకల్యం కూడా ఉంది. ఆమె ఇదే ప్రాంతంలో 35 ఏళ్లుగా, వీధుల్లో ఒంటరిగా ఉంటోంది. స్థానికులు ఆమెకు ఆహారం, బట్టలు వంటివి అందిస్తుంటారు. గత గురువారం అర్ధరాత్రి ఆమె ఒక షాపు పక్కన ఒంటరిగా నిద్రిస్తుండగా, ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె ప్రతిఘటించింది. వెంటనే నిందితుడు కోపంతో ఆమెపై ఇటుకతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వృద్ధురాలిపై అత్యాచారయత్నం అనంతరం నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు బాధిత మహిళను ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.త