మాస్కో, మార్చి 23: రష్యా రాజధాని మా స్కోలో భీకర ఉగ్రదాడి జరిగింది. ఓ సంగీత కచేరీలో పాల్గొన్న ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల అనంతరం హాల్కు ని ప్పు పెట్టి పారిపోయారు. ఈ ఘోర దాడిలో దాదాపుగా 143 మంది కన్నుమూయగా, 140 వరకు గాయపడి చికిత్స పొందుతున్నా రు. మాస్కోలోని క్రాస్నోగోర్స్ ప్రాంతంలో ఉన్న క్రాకస్ సిటీ హాల్లో శుక్రవారం రాత్రి ఓ సంగీత కచేరీ జరిగింది. ‘పిక్నిక్’ అనే రాక్బ్యాండ్ బృందం ఈ కచేరీ చేపట్టింది. హాల్ మొత్తం కిక్కిరి సి ఉన్న వేళ నలుగురు ఉగ్రవాదులు ఆటోమెటిక్ ఆయుధాలతో హాల్లోకి ప్రవేశించారు. వస్తూనే వేదిక వద్ద నుంచి విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. బాంబులు విసిరారు.కంటికి కనిపించిన వారందరిపై పా యింట్ బ్లాంక్ రేంజ్లో ఉగ్రవాదులు కాల్పు లు జరిపారు. కాల్పుల అనంతరం ఇంధనం చల్లి హాల్కు నిప్పు పెట్టి పారిపోయారు. మం టల కారణంగా ప్రాణనష్టం పెరిగింది.
పట్టుబడ్డ ఉగ్రవాదులు!
కాల్పులకు పాల్పడ్డ నలుగురి సహా 11 మంది అనుమానితులను రష్యా భద్రత సంస్థ ఎఫ్ఎస్బీ అదుపులోకి తీసుకుంది. కాగా, ఉగ్రవాదులకు ఉక్రెయిన్లో కాంటాక్టులు ఉన్నాయని రష్యా ఆరోపించగా, దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.