బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో దారుణం చోటుచేసుకున్నది. శ్మశాన వాటిక లేక మరణించిన ఓ దళితుడిని తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు పక్కనే ఖననం చేశారు. తిమ్మినయకంహల్లి గ్రామానికి చెందిన తిమ్మరాజు తండ్రి పెద్దయ్య (65) వృద్ధాప్య సంబంధ సమస్యలతో మరణించారు. గ్రామంలో శ్మశానవాటిక లేకపోవడంతో రోడ్డు వెంట తన తండ్రి మృతదేహాన్ని ఖననం చేయాల్సి వచ్చిందని తిమ్మరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కొన్నేండ్లుగా విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇకనైనా శ్మశాన వాటికలు కేటాయించాలని గ్రామస్థులు కోరారు.