భువనేశ్వర్ : యాస్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో రూ. 610 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది. గురువారం ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టం, పునరుద్ధరణ పనులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సహాయ కమిషనర్ ప్రదీప్ కే జెనా రాష్ట్రంలో తుఫాన్ మిగిల్చిన నష్టం వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాణనష్టం జరగొద్దన్న లక్ష్యంతో అధికారులు పనిచేసి విజయవంతమయ్యారని ఆయన పేర్కొన్నారు.
11 వేల గ్రామాలకు చెందిన 60 లక్షల మంది తతుఫాన్ కారణంగా ప్రభావితమయ్యారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 610 కోట్ల మేర ఆస్తినష్టం సంభవించినట్లు జెనా తెలిపారు. ఇందులో రూ. 520 ప్రభుత్వ మౌలిక వసతులకు, 90 కోట్ల మేర వ్యక్తిగత ఆస్తులకు నష్టం జరిగిందని స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లోని తీర ప్రాంతాల్లోని సాగు భూముల్లోకి ఉప్పునీటి వరద చేరడంతో రానున్న సాగుకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితిపై స్కూల్ ఆఫ్ అగ్నికల్చర్ అండ్ టెక్నాలజీ, సెంట్రల్ రైస్ రీసెర్చ్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.