బెంగళూరు: ప్రపంచ సగటు కంటే రెట్టింపు స్థాయిలో భారత్లో సైబర్ నేరాలు జరుగుతున్నాయని జాతీయ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఎం యూ నాయర్ ఆదివారం పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో ఆయ న మాట్లాడుతూ రాన్సమ్వేర్ సైబర్ దాడుల్లో గత 10 నెలల్లో సగటున దాదాపు రూ.12,800 కోట్ల మేర సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారని, ఇది 2022 నుంచి రెట్టింపు అయింద న్నారు. భారత్లో గత ఆరు నెలలుగా సగటున 2,127 సైబర్ ఘటనలు జరిగాయని, ఇది ప్రపంచ సగటు 1,108 కంటే రెట్టింపు అని తెలిపారు.