కొచ్చి: కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో 85 లక్షల ఖరీదు చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్ రూపంలో ఆ బంగారాన్ని తరలిస్తున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్లో ఉన్న టాయిలెట్ల వద్ద రెండు ప్యాకెట్లను గుర్తించారు. అబుదాబి నుంచి వచ్చిన విమానంలో ఆ బంగారం పేస్ట్(Gold Paste) ప్యాకెట్లను రికవరీ చేశారు. ఆ ప్యాకెట్లు సుమారు 1.7 కిలోల బరువు ఉన్నట్లు తెలుస్తోంది. కస్టమ్స్ అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. రెండు వారాల క్రితం కూడా ఓ ప్రయాణికుడి నుంచి 48 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్యాంట్ లోపల బంగారం పేస్టును అతను పెట్టుకున్నాడు. కౌలాలంపూర్ నుంచి కొచ్చి వచ్చిన ఆ ప్రయాణికుడిని అరెస్టు చేశారు.