కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఇటీవల హింస చెలరేగిన బీర్బమ్ ప్రాంతాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సికందర్ గ్రామంలోని ఫుట్బాల్ గ్రౌండ్ సమీపంలో ఒక సంచిలో ఉన్న నాటు బాంబులను పోలీసులు ఆదివారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటిని ధ్వంసం చేసేందుకు కేంద్ర దర్యాప్తు విభాగం (సీఐడీ) బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రప్పించారు. కాగా, బీర్బమ్లో ఇటీవల జరిగిన హింసలో ఇద్దరు పిల్లలతో సహా 8 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం బెంగాల్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 7వ తేదీ నాటికి ఘటనకు సంబంధించిన రిపోర్ట్ను దాఖలు చేయాలని సీబీఐకి సూచించింది.
దీంతో సీబీఐ అధికారులు బీర్బుమ్ జిల్లా రామ్పూర్హట్లోని బగ్తుయ్ గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హింసా కాండలో నిప్పుపెట్టిన ఇంటిని సీబీఐ ఫోరెన్సిక్ బృందం రెండో రోజైన ఆదివారం కూడా తనిఖీ చేసింది. కాలిన శిథిలాల నుంచి నమూనాలను సిబ్బంది సేకరించారు.
మరోవైపు ఈ హింసాకాండలో గాయపడి చికిత్స పొందుతున్న ఒక మహిళతోపాటు ముగ్గురు వ్యక్తులతో తాము మాట్లాడి వివరాలు తెలుసుకుంటామని సీబీఐ అధికారులు తెలిపారు. స్థానిక ప్రజలతో కూడా ఈ ఘటన గురించి మాట్లాడతామని చెప్పారు. కాలిన ఇంటితోపాటు ఆ పరిధిలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ సిబ్బంది తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు.
West Bengal | CBI's forensic team inspects the epicentre of arson and violence in Bagtui village in Rampurhat, Birbhum district for the second day. They collected samples of charred debris from the spot for further investigation. pic.twitter.com/hl5TvMs5Dn
— ANI (@ANI) March 27, 2022