చామరాజనగర్: భారత వాయుసేనకు చెందిన కిరణ్ అనే శిక్షణ విమానం గురువారం ఉదయం కర్ణాటకలోని చామరాజనగర్కూలిన ఐఏఎఫ్ శిక్షణ విమానం జిల్లాలోని భోగాపుర సమీపంలోని ఖాళీ స్థలంలో కుప్పకూలింది. విమానం అదుపు తప్పినట్టు గుర్తించిన పైలట్లు తేజ్పాల్, భూమిక సురక్షితంగా బయటపడ్డారు. శిక్షణలో భాగంగా బెంగళూరు ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరిన విమానం కూలిపోయినట్టు భారత వాయుసేన ట్వీట్ చేసింది.
ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు ప్రకటించింది. రెండు రోజుల క్రితం కూడా బెళగావిలోని సంబ్రా ఎయిర్పోర్టు నుంచి బయల్దేరిన రెడ్బర్డ్ శిక్షణ విమానం ఓ వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఈ ఘటనలోనూ పైలట్లు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.