హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు తీరని నష్టం చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ముక్త్భారత్ కోసమే పోరాడుతున్నామని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ అన్నారు. శనివారం రాజస్థాన్ జైపూర్లోని అగ్రసేన్భవన్లో నిర్వహించిన 18 రాష్ట్రాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ర్టాల్లో ఓల్డ్ పెన్షన్ స్కీంను అమలుచేసే పార్టీకే ఓట్లు వేయాలని తీర్మానించామని చెప్పారు. పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్కు ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షుడు విజయ్కుమార్ బంధు, తెలంగాణ సీపీఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, కోశాధికారి నరేష్గౌడ్ ఈ సమావేశానికి హాజరయ్యారు.