న్యూఢిల్లీ: సౌత్ ఏషియన్ యూనివర్సిటీ(ఎస్ఏయూ)లో నలుగురు ఫ్యాకల్టీని సస్పెండ్ చేయటాన్ని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం ఖండించారు. యూనివర్సిటీ యాజమాన్యం నిర్ణయం అప్రజాస్వామికం, నిబంధనలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్కు మంగళవారం లేఖ రాశారు. సరైన విచారణ చేపట్టకుండా ఫ్యాకల్టీ సభ్యుల్ని సస్పెండ్ చేశారని, ఇలాంటి చర్యల వల్ల వర్సిటీ ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
మంత్లీ ైస్టెపెండ్ను తగ్గించటంపై 2022లో పీజీ విద్యార్థులు నిరసన చేపట్టగా, ఆ సమయంలో కొంతమంది వర్సిటీ ఫ్యాకల్టీ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు నమోదయ్యాయి. దీనికి సంబంధించి నలుగురు ఫ్యాకల్టీ సభ్యులు సస్పెండ్కు గురయ్యారు. సార్క్ కూటమిలోని 8 సభ్య దేశాలు ఎస్ఏయూకి స్పాన్సర్షిప్ అందిస్తున్నాయి. ఇటీవల ఓ దళిత విద్యార్థి విషయంలో వర్సిటీ యాజమాన్యం వ్యవహరించిన తీరు కూడా వివాదాస్పదమైంది.