పనాజీ: న్యూ ఇయర్ సంబరాల సందర్భంగా సుమారు రెండు వేల మంది ప్రయాణికులతో ముంబై నుంచి గోవాకు వచ్చిన ఓ క్రూయిజ్షిప్ తిరుగు ప్రయాణం అయ్యింది. కార్డీలియా షిప్లో వచ్చిన ప్రయాణికులకు పరీక్ష చేయగా.. దాంట్లో 66 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే గోవాలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ మెడికల్ హబ్లో చేరేందుకు ప్రయాణికులు నిరాకరించడంతో.. ఆ క్రూయిజ్షిప్ను మళ్లీ ముంబైకి పంపించారు. షిప్లోని సుమారు 66 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే పాజిటివ్ వ్యక్తులందరూ క్రూయిజ్షిప్లోనే ఉండనున్నట్లు ఓ అధికారి తెలిపారు. గోవా జిల్లా యంత్రాంగం ఆదేశాల ప్రకారం.. క్రూయిజ్షిప్లోని ప్రయాణికులందరూ మళ్లీ ముంబైకి పయనమయ్యారు. షిప్లోనే పాజిటివ్ ప్యాసింజెర్లు ఐసోలేట్ చేయనున్నట్లు షిప్పింగ్ ఆపరేషన్స్ మేనేజర్ గోవింద్ పెర్నుల్కర్ తెలిపారు.