న్యూఢిల్లీ : కరోనా కేసుల పెరుగుదలతో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గోవాలో పార్టీలు, ఈవెంట్ల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది. న్యూ ఇయర్ పార్టీలు, ఈవెంట్లలో పాల్గొనే అతిధులు కొవిడ్-19 వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తిచేసుకోవాలని లేదా కరోనా పరీక్షలో నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకువస్తేనే అనుమతిస్తామని గోవా సీఎం ప్రమోద్ సావంత్ బుధవారం స్పష్టం చేశారు.
దీనికి సంబంధించి సవివర మార్గదర్శకాలను మరికాసేపట్లో జారీ చేస్తామని చెప్పారు. కరోనా కేసులు మూడంకెలు దాటడంతో కర్ఫ్యూ ఇతర నియంత్రణలు అమల్లోకి వస్తాయనే వార్తలను సీఎం తోసిపుచ్చారు. టూరిజం వ్యాపారం బలహీనపడాలని తమ ప్రభుత్వం కోరుకోవడం లేదని చెప్పారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల నేపధ్యంలో గోవాకు టూరిస్టుల రాక అనూహ్యంగా పెరిగింది.