న్యూఢిల్లీ, జూన్ 10: కరోనా కట్టడిలో భాగంగా ఇస్తున్న ‘కొవిషీల్డ్’ టీకా రెండు డోసుల మధ్య ఎడం 12-16 వారాలుగా కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కొన్ని వర్గాల ప్రజలకు ఈ వ్యవధిని తగ్గిస్తూ నిబంధనల్లో కేంద్రం కొన్ని సవరణలు చేసింది. చదువుల కోసం తమ దేశానికి వచ్చే విద్యార్థులు, ఇంకా ఉద్యోగులు, క్రీడాకారులకు పలు దేశాలు వ్యాక్సిన్ సర్టిఫికెట్ను తప్పనిసరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా వ్యక్తులకు రెండో డోసు విషయంలో గడువును తగ్గించింది.
తాజా మార్గదర్శకాలు
ఆస్ట్రాజెనెకా టీకాతో ప్లెట్లెట్ల రిస్క్!
లండన్, జూన్ 10: ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (భారత్లో కొవిషీల్డ్) వేసుకున్న వారి రక్తంలో ప్లెట్లెట్ల సంఖ్య తగ్గడాన్ని గుర్తించినట్టు బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ పరిశోధకులు తెలిపారు. అయితే, ప్రతి 10 లక్షల మందిలో కేవలం 11 మందిలోనే దీన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. రక్తంలో ప్లెట్లెట్ల సంఖ్య తగ్గడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడవచ్చని వివరించారు.