PSLV| శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తిచేసింది. పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగానికి శనివారం కౌంట్డౌన్ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనుంది. సింగపూర్కి చెందిన రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ డీఎస్-ఎస్ఏఆర్తోపాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీలకు అవసరమైన ఉపగ్రహ ఛాయాచిత్రాలను ఇది అందించనుంది. ఇస్రో ఈ నెలలో చేపట్టనున్న రెండో ప్రయోగం ఇది.
చంద్రుడిపై పరిశోధనల కోసం ఈ నెల 14న చంద్రయాన్-3ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఇంతముందెన్నడూ ఎవరూ చేరని చంద్రుడి దక్షిణ భాగాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం ల్యాండర్ చంద్రుడిపై కాలు మోపనుంది.