ముంబై: కరోనా వైరస్ సహజమైనది కాదని, అది కొన్ని దేశాలు చేసిన బయో వార్ కుట్ర అని ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధినేత రవిశంకర్ వ్యాఖ్యానించారు. సోమవారం మహారాష్ట్రలో చేసిన ప్రవచనంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా టీకాలు సరిగా పని చేయడం లేదనే విషయాన్ని పెద్ద దేశాలు సమర్థిస్తున్నాయని అన్నారు. ‘ప్రపంచం ఈ వైరస్తో పోరాడింది. ఇది సహజమైందని కాదని నేను ఆనాడే చెప్పాను. అదిప్పుడు నిరూపితమైంది’ అని రవిశంకర్ అన్నారు. ఎన్ఏఓక్యూ19 అనే ఆయుర్వేద ఔషధాన్ని తాము తయారుచేసి 14 దవాఖానల్లో పరీక్షించామని తెలిపారు. కణజాల పరీక్షలోనూ ఇది కరోనా వైరస్పై సమర్థంగా పని చేసినట్టు నిరూపితమైందని తెలిపారు. మన దేశానికి చెందిన యోగ, ఆయుర్వేదంపై నమ్మకం ఉంచాలని రవిశంకర్ పిలుపునిచ్చారు.
కొవిడ్-19 చైనాలోని వుహాన్ ప్రయోగశాల నుంచే వ్యాపించిందని అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి పోటీలో ఉన్న రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ ఆరోపించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ట్వీట్ చేశారు.