న్యూఢిల్లీ, జూన్ 8: కరోనా చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్సీక్యూ) సమర్థవంతంగా పని చేస్తున్నదని మనదేశంలో భారీస్థాయిలో జరిగిన ఒక అధ్యయనం వెల్లడించింది. కరోనా ఔషధాల జాబితా నుంచి హెచ్సీక్యూను కేంద్రప్రభుత్వం తొలిగించిన రెండురోజుల్లోనే ఈ వివరాలు మంగళవారం బయటకురావటం విశేషం. ఆరువారాలు లేదా అంతకన్నా ఎక్కువ కాలంపాటు హెచ్సీక్యూను (400 ఎంజీ లేదా 800 ఎంజీ చొప్పున) ఉపయోగిస్తే వైరస్ నుంచి 72 శాతం మేర రక్షణ లభిస్తున్నట్లుగా తెలిసింది. కరోనా సోకనివారేగాక సోకిన వారిలో కూడా హెచ్సీక్యూ మంచి ఫలితాలను ఇస్తున్నట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లోని 44 దవాఖానల్లో పని చేస్తున్న 12 వేల మంది డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. గత ఏడాది మే-సెప్టెంబర్ మధ్య జరిగిన అధ్యయనం వివరాలను ‘అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా’ జర్నల్లో ప్రచురించారు.
మలేరియాపై బ్రహ్మాస్త్రం
మలేరియా చికిత్సలో ఉపయోగించే హైడ్రాక్సీ క్లోరోక్విన్ను కరోనాకు కూడా వాడవచ్చని, అది బ్రహ్మాండంగా పని చేస్తుందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గతంలో తెలిపారు. అమెరికాకు భారత్ భారీఎత్తున హెచ్సీక్యూ ఔషధాన్ని గతంలో పంపించింది.