భోపాల్: వివాదాస్పద రచయిత్రి డాక్టర్ ఫర్హత్ ఖాన్ను అరెస్టు చేశారు. పూణెలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. హాస్పిటల్లో డయాలసిస్ చేయించుకుంటున్న సమయంలో ఆమెను అరెస్టు చేశారు. కలెక్టివ్ వాయిలెన్స్ అండ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ పేరుతో ఫర్హత్ ఖాన్ ఓ పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకాన్ని ఇండోర్లో ఉన్న ప్రభుత్వ లా కాలేజీలో ఉంచారు. అయితే ఆ పుస్తకంలో హిందువుల గురించి అభ్యంతరకర అంశాలు ఉన్నట్లు ఏబీవీపీ ఆరోపిస్తోంది.
పోలీసుల ప్రకారం డాక్టర్ ఖాన్ తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెకు రెగ్యులర్గా డయాలసిస్ చేస్తున్నారు. ఖాన్కు వ్యతిరేకంగా డిసెంబర్ 3వ తేదీన ఫిర్యాదు నమోదు అయ్యింది. పుస్తక ప్రచురణకర్తలైన అమర్ లా పబ్లికేషన్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఇనామ్ ఉర్ రెహ్వాన్, ప్రొఫెసర్ మీర్జా మోజిజ్ బెయిగ్లపైన కూడా ఫిర్యాదు నమోదు చేశారు.