Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ను బీజేపీ బరిలో దింపడంతో ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ స్పందించారు. ప్రజలు తమ కష్టసుఖాల్లో పాలు పంచుకునే నాయకుడిని కోరుకుంటారా..? స్టార్డమ్ను చూసి ఓటు వేస్తారా అనేది నిర్ణయించుకోవాలని సింగ్ కోరారు.
కంగనా రనౌత్ బాలీవుడ్కు సేవలు అందించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని, కానీ రాజకీయ పోరాటం ఆమెకు కొత్తని అన్నారు. కంగనా రనౌత్ దృష్టి బాలీవుడ్ సినిమాల పైనే ఉంటుందని, హిమాచల్ ప్రదేశ్లో మూడింట రెండు వంతుల ప్రాంతమైన మండి నియోజకవర్గానికి ఆమె సమయం కేటాయించగలదా అని ప్రశ్నించారు.
బాలీవుడ్ నటి కంనా రనౌత్ను మండి నుంచి బరిలో దింపాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని అన్నారు. బాలీవుడ్కే ప్రాధాన్యత ఇచ్చే నటిని ఎన్నికల బరిలో నిలపడం మంచి నిర్ణయం కాదని స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కంగనా రనౌత్ చేసిన సేవలేంటని కూడా ఆయన ప్రశ్నించారు. ఈ అంశాలపై రాబోయే రోజుల్లో కచ్చితంగా చర్చ జరుగుతుందని అన్నారు.
Read More :
Kiara Advani | బోల్డ్ లుక్లో చిలిపి పోజులతో కవ్విస్తున్న కియారా అద్వానీ