న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత కీర్తి ఆజాద్.. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దీంతో బీహార్లో తృణమూల్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. 1983 క్రికెట్ వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్.. బీహార్లోని దర్బంగా సీటు నుంచి మూడుసార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో బీజేపీలో ఉన్న కీర్తి ఆజాద్..ఆ పార్టీని వీడారు. దివంగత మాజీ మంత్రి అరుణ్ జైట్లీ.. ఢిల్లీ క్రికెట్ సంఘంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపించడంతో కీర్తి ఆజాద్ను బీజేపీ నుంచి సస్పెండ్ చేశారు. కీర్తి ఆజాద్తో పాటు కాంగ్రెస్ నేత అశోక్ తన్వర్ టీఎంసీలో చేరనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమక్షంలో కీర్తి ఆజాద్ టీఎంసీలో చేరనున్నారు.