Congress | రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరుగుతున్న కాంగ్రెస్ నవ్సంకల్ప్ చింతన్ శివిర్ సదస్సుకు సీనియర్ నేత కపిల్ సిబాల్ మినహా అసమ్మతి వాదులంతా హాజరయ్యారు. నాయకులంతా ఐక్యంగా కనిపించారు. అయితే, ఈ సదస్సులో అసమ్మతి వాదుల డిమాండ్కు ఆమోదం లభించినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డును ఏర్పాటు చేయాలన్న అసమ్మతి వాదుల డిమాండ్ అమల్లోకి రావాలంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆమోదం కావాల్సి ఉంటుంది.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ స్థానంలో పార్లమెంటరీ బోర్డు వస్తుందని సమాచారం. కానీ, గాంధీ కుటుంబ సన్నిహితులు మాత్రం ఈ డిమాండ్ను అనుమతించేది లేదని చెబుతున్నారు. దీనిపై పార్టీలో చర్చ జరుగుతుందని అంటున్నారు. పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు చేసే విషయమై ఏకాభిప్రాయం వచ్చాక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
ఇక బీజేపీపై పోరులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని పార్టీలతో రాష్ట్రాల వారీగా కూటములు ఏర్పాటు చేస్తారా.. అన్న విషయమై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్గాంధీ పోటీ చేస్తారా? లేదా.. అన్న విషయమై ఆయన ఎటువంటి సంకేతాలివ్వలేదు. ఇప్పటికీ గాంధీయేతరులే పార్టీకి అధ్యక్షత వహించాలని రాహుల్ భావిస్తున్నారని సమాచారం.