న్యూఢిల్లీ, ఆగస్టు 1: కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను చమురు సంస్థలు సవరించాయి. సిలిండర్కు రూ.100 తగ్గించినట్టు మంగళవారం ఓ నోటిఫికేషన్లో పేర్కొన్నాయి. దీంతో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,680కి చేరింది. అయితే గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో మాత్రం కేంద్రం ఎటువంటి మార్పులు చేయలేదు. ఇదే సమయంలో విమాన ఇంధన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్)ను చమురు సంస్థలు కిలోలీటర్కు ఏకంగా రూ.7,728(8.5 శాతం) పెంచాయి. ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ రూ.98,508గా ఉన్నది. ఏటీఎఫ్ ధరలను పెంచడం నెలలో ఇది రెండోసారి.