న్యూఢిల్లీ, అక్టోబర్ 2: దేశాలన్నీ అంతర్జాతీయ కట్టుబాట్లకు లోబడి నడుచుకోవాలని సుద్ధులు చెప్తున్న అమెరికా, పాశ్చాత్య దేశాలు చరిత్రలో ఎన్నడూ ఆ నియమాలను పాటించలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ధ్వజమెత్తారు. వలస విధానాలతో భారత్, ఆఫ్రికాలను దోచుకోవడంతోపాటు నల్లమందు యుద్ధాలు, రసాయన, అణ్వాయుధాలతో పలు దేశాలను నాశనం చేశాయని నిప్పులు చెరిగారు. ‘మధ్యయుగాల్లోనే పాశ్చాత్య దేశాలు వలస విధానాలను అమల్లోకి తెచ్చాయి. బానిస వ్యాపారానికీ తెగబడ్డాయి. అమెరికాలో రెడ్ ఇండియన్లను ఊచకోత కోశాయి. ఇప్పుడు రష్యాను తమ కాలనీగా మార్చుకోవాలని చూస్తున్నాయి’ అని పుతిన్ పేర్కొన్నారు.