కోల్కతా : కొన్నాళ్లుగా తాను పాటిస్తున్న సంప్రదాయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఏడాదీ కొనసాగించారు. ప్రధాని మోదీకి మామిడి పండ్లు పంపారు. 2011 నుంచి ఆమె ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది కూడా మోదీకి బెంగాల్లో ప్రముఖంగా పండే హిమసాగర్, మల్ద, లక్ష్మణ్భోగ్ రకాలను పంపించారు. ప్రధానితో పాటు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కూ మామిడి పండ్లను పంపారు.