బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్నది. అక్కడ ప్రతిరోజు 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల రక్షణ కోసం కర్ణాటక విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలను మూసివేసిన సర్కారు.. తాజాగా 11వ, 12వ తరగతి చదివే విద్యార్థులకు ఊరటనిచ్చే నిర్ణయం చేసింది. 11వ తరగతి విద్యార్థులను తదుపరి తరగతికి ప్రమోట్ చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఈ విషయాన్ని కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ వెల్లడించారు.