కోల్కతా: మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో టీఎంసీ, బీజేపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ జరిగింది. (Clashes Between TMC, BJP Councillors) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. శనివారం కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ, వామపక్ష సభ్యులకు ఎలాంటి ప్రశ్నలు లేవా అని టీఎంసీ కౌన్సిలర్ రాయ్ ప్రశ్నించారు. వారి పరిస్థితి ఇలా ఉందని మేయర్ ఫిర్హాద్ హకీమ్ వ్యాఖ్యానించారు.
కాగా, అధికారంలో ఉన్న సభ్యులు స్పందించకపోతే ప్రశ్నలు అడిగి ఏమి ప్రయోజనమని బీజేపీ కౌన్సిలర్ సాజల్ ఘోష్ బదులిచ్చారు. దీంతో టీఎంసీ, బీజేపీ, వామపక్ష సభ్యుల మధ్య రచ్చ జరిగింది. ఈ నేపథ్యంలో టీఎంసీకి చెందిన అసిమ్ బసు, బీజేపీకి చెందిన సాజల్ ఘోష్ ఘర్షణకు దిగారు. సభ అదుపుతప్పడంతో చైర్పర్సన్ మాలా రాయ్ కొంతసేపు వాయిదా వేశారు. అయితే టీఎంసీ, బీజేపీ కౌన్సిలర్లు గొడవకు దిగిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Faceoff between TMC and BJP corporators inside the Kolkata municipal corporation.
FYI: The TMC has 134 corporators while the BJP has 3.pic.twitter.com/OUjzha9AWm
— Sourav || সৌরভ (@Sourav_3294) September 16, 2023
#WATCH | West Bengal | TMC and BJP councillors entered into a brawl with each other at Kolkata Municipal Corporation today. pic.twitter.com/0vRYdGxsD8
— ANI (@ANI) September 16, 2023