న్యూఢిల్లీ, జూన్ 16: టెలికం సర్వీస్ ప్రొవైడర్ల మాదిరే విద్యుత్తు సరఫరాదారును ఎంచుకొనే అవకాశాన్ని కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ది ఎలక్ట్రిసిటీ(అమెండ్మెంట్)బిల్-2021 ప్రకారం.. వినియోగదారుడు తనకు ఇష్టమున్న విద్యుత్తు సరఫరాదారును ఎంచుకోవచ్చు. విద్యుత్తు పంపిణీ సంస్థల మధ్య పోటీ తత్వాన్ని పెంచేందుకు ఈ బిల్లును తీసుకొస్తున్నట్టు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు.