కోల్కతా: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరానికి పశ్చిమ బెంగాల్లో నిరసన సెగ ఎదురైంది. ఒక కేసులో వాదించేందుకు న్యాయవాదిగా కలకత్తా హైకోర్టుకు బుధవారం వచ్చిన ఆయనను కాంగ్రెస్ సెల్ న్యాయవాదులు అడ్డుకున్నారు. నల్ల వస్త్రాలు చూపి నిరసన తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చిదంబరం సానుభూతిపరుడని ఆరోపించారు. బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ దుస్థితికి ఆయనే కారణమని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి చిదంబరం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కారు వైపు వెళ్తున్న ఆయనను నిరసన తెలుపుతూ కాంగ్రెస్ సెల్ న్యాయవాదులు అనుసరించారు. అయితే చిదంబరం ఏమీ స్పందించలేదు. మౌనంగా నడుచుకుంటూ వెళ్లి తన కారులో కూర్చొన్నారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 213 స్థానాల్లో విజయం సాధించగా ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 291 సీట్లలో పోటీ చేసిన బీజేపీ 77 స్థానాలకే పరిమితమైంది. గూర్ఖా జనముక్తి మోర్చా (జీఏఎం) తృణమూల్ అనుకూల వర్గం, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) ఒక్కో సీటు గెలుచుకున్నాయి. అయితే గతంలో కొన్నేండ్లపాటు అధికారంలో ఉన్న సీపీఎంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు అయినా దక్కించుకోలేకపోయాయి.
#WATCH | Congress leader & advocate P Chidambaram faced protest by lawyers of Congress Cell at Calcutta HC where he was present in connection with a legal matter. They shouted slogans, showed him black robes & called him a TMC sympathiser & responsible for party's poor show in WB pic.twitter.com/SlH4QgbJSn
— ANI (@ANI) May 4, 2022