రాయ్పూర్: ఇవాళ గుజరాత్ రెండో (తుది) దశ ఎన్నికలతోపాటే దేశవ్యాప్తంగా ఒక లోక్సభ, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని స్థానాల్లోనూ ఇంచుమించుగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. ఛత్తీస్గఢ్లోని భానుప్రతాప్పూర్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇవాళే పోలింగ్ జరుగుతున్నది.
ఈ క్రమంలో భానుప్రతాప్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి మాండవి ఇవాళ పోలింగ్ ప్రారంభం కాగానే మొదటి గంటలోనే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఛత్తీస్గఢ్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పనులు చేసిందన్నారు. కాబట్టి పరిస్థితులు తమకే అనుకూలంగా ఉన్నాయని, నియోజకవర్గ ప్రజలు తనకే ఓటేస్తారని సావిత్రి ధీమా వ్యక్తంచేశారు.
Chhattisgarh | Congress candidate for Bhanupratappur constituency, Savitri Mandavi casts her vote for by-poll to the assembly seat
She says, “Atmosphere is in favour of Congress because our Govt has set standards of development. Looking at those works, people are voting for us” pic.twitter.com/LbofcidgSk
— ANI (@ANI) December 5, 2022