రాయ్పూర్: మావోయిస్టు పార్టీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) మృతిపై ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. బస్తర్ అటవీ ప్రాంతంలో ఆర్కే మరణించినట్లు సమాచారం అందిందని ఆ ప్రాంత ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. అనారోగ్యంతోనే ఆర్కే మృతిచెందినట్లు సెంట్రల్ కమిటీ కూడా నిర్ధారించినట్లు ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో నక్సల్స్ సప్లయర్స్పై నిఘా పెట్టినట్లు ఐజీ చెప్పారు. గత రెండేళ్లలో రామన్న, హరిభూషణ్, ఆర్కే సహా పలువురికి మందులు అందించారని, ఈ ఘటనలపై స్థానికులు తమకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు వెల్లడించారు. బస్తర్లో శాంతి నెలకొనేలా చర్యలు తీసుకుంటామని బస్తర్ ఐజీ స్పష్టం చేశారు.