రాయ్పూర్, సెప్టెంబర్ 7: బ్రాహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ తండ్రి నంద్కుమార్ బఘేల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను రాయ్పూర్కు తీసుకొచ్చారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. ఇటీవల యూపీలో జరిగిన ఓ కార్యక్రమంలో బ్రాహ్మణులను కించపరిచేలా నంద్కుమార్ మాట్లాడారని పేర్కొంటూ ‘సర్వ్ బ్రాహ్మిణ్ సమాజ్’ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.