డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఎంత మంది భక్తులైనా పాల్గొనవచ్చని ఉత్తరాఖండ్ హైకోర్టు తెలిపింది. ఇటీవల యాత్రకు అనుమతించిన హైకోర్టు.. ప్రతిరోజు కొంతమందిని మాత్రమే అనుమతించాలని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆంక్షలను తొలగించాలంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. రోజువారీ పరిమితిపై ఆంక్షలు తొలగించింది.