డెహ్రడూన్, మే 14: ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్ర తొలి 26 రోజుల్లో అనారోగ్యంతో 38 మంది యాత్రికులు మరణించారని అధికారులు గురువారం తెలిపారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 19న తెరువటంతో ఈ చార్ధామ్ మొదలైంది. కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలు వరుసగా ఏప్రిల్ 22, 23 తేదీల్లో భక్తుల కోసం తెరిచారు. కేదార్నాథ్లో అత్యధికంగా 21మంది మరణించారని రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఒకటి తెలిపింది.
బద్రినాథ్లో ఏడుగురు, గంగోత్రి, యమునోత్రిలో ఐదేసి మంది చొప్పు న మరణించారు. అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో అనారోగ్యం, గుండెపోటుతో వీరి మరణాలు సంభవించినట్టు అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం నాటికి 11.81 లక్షల మందికిపైగా యాత్రికులు ఈ ఆలయాలను సందర్శించారు. చార్ధామ్, హేహకుంద్ సాహిబ్ యాత్రల రిజిస్ట్రేషన్లు ఈసారి 33.96 లక్షల మార్కును దాటింది.