న్యూఢిల్లీ: సారే జహాసే అచ్చా(Saare Jahan Se Achha) గేయాన్ని రాసింది మహమ్మద్ ఇక్బాల్. ఆయన పాకిస్థాన్ జాతీయ కవి. అవిభజిత భారతదేశంలో 1877లో ఆయన సియాల్కోట్లో జన్మించారు. పాకిస్థాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలన్న ఐడియా కూడా ఈయనదే. అయితే ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీలోని పొలిటికల్ సైన్స్ విభాగం ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక్బాల్ గురించి ఉన్న ఓ చాప్టర్ను సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ అకాడమి మండలి ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
బీఏ చదువుతున్న వారిలో ఆరో సెమిస్టర్ పేపర్గా ఇక్బాల్ గురించి ఉంది. మాడ్రన్ ఇండియన్ పొలిటికల్ థాట్ చాప్టర్లో ఆ ప్రముఖ కవి గురించి రాశారు. అయితే ఆ చాప్టర్ తొలగించాలన్న తుది నిర్ణయం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకుంటుందని అధికారులు చెప్పారు. యూనివర్సిటీ మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఏబీవీపీ స్వాగతించింది.
పాకిస్థాన్ తత్వవేత్తగా మహమ్మద్ ఇక్బాల్కు గుర్తింపు ఉంది. ముస్లిం లీగ్లో జిన్నాను కీలక నేతగా తీర్చిదిద్దడంలో ఇక్బాల్ ముఖ్య పాత్ర పోషించారు. భారత్ విభజనలో జిన్నాకు ఎంత బాధ్యత ఉందో, అంతే బాధ్యత ఇక్బాల్పై ఉంటుందని ఓ విద్యార్ధి విభాగం పేర్కొన్నది.