Night Curfew | కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అవసరమైతే రాత్రి కర్ఫ్యూ విధించాలని శనివారం ఆదేశించింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నది. 10 రాష్ట్రాల్లో రెండు వారాలుగా వైరస్ పాజిటివిటీ రేటు పెరుగుతున్నదని కేంద్రం హెచ్చరించింది.
కేరళ, మిజోరం, సిక్కిం రాష్ట్రాల్లోని 8 జిల్లాల పరిధిలో 10 శాతం పాజిటివిటీ రేటు నమోదవుతున్నదని గుర్తు చేసింది. మరో ఏడు రాష్ట్రాల్లో ఐదు నుంచి పది శాతం పాజిటివిటీ రేటు రికార్డవుతున్నదని వివరించింది. జన సమూహాలు, వివాహాలు, అంత్యక్రియలకు హాజరయ్యే వారి సంఖ్యపై పరిమితులు విధించాలని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది.